One Tv News - NEWS / కర్నూలు జిల్లా : ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చార్జీలు అమాంతరం పెంచడంతో సామాన్య ప్రజల పై పెనుబారం పడింది. రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగడంతో కర్నూల్ నగరంలోని కల్లూరు కర్నూలు సబ్ రిజిస్టర్ కార్యాలయాలు వెలవెలబోయాయి. జూన్ నెల నుండి రిజిస్ట్రేషన్ చార్జీలు పెరుగుతాయన్నదానితో గతవారం ముందస్తుగా రిజిస్టర్లు చేసుకున్న వైనం రాష్ట్రవ్యాప్తంగా నెలకొంది. ప్రభుత్వం ఆదాయమే లక్ష్యంగా తీసుకున్న నిర్ణయం సామాన్య మధ్యతరగతి ప్రజలకు పెనుబారంగా పరిణమించింది.
దీనిపై స్టాంప్ రైటర్లు సైతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల సామాన్య ప్రజలపై భారం పడుతుందని రిజిస్టర్ కార్యాల వద్ద ప్రత్యక్షంగా పరోక్షంగా జీవనం కొనసాగిస్తున్న వారిపై కూడా ఈ ప్రభావం చూపకమానదని వారు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
One Tv News