Sunday, 26 April 2026 02:40:37 PM

బి ఆర్ ఎస్ అంటే బిజెపికి బంధువు...

జన గర్జన

Date : 02 July 2023 08:47 PM Views : 259

One Tv News - NEWS / ఖమ్మం జిల్లా : భారత్‌ జోడో యాత్రకు తెలంగాణ ప్రజలు అండగా నిలిచారని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. అధికారంలోకి వస్తే వితంతువులు, వృద్ధులకు రూ.4వేల పెన్షన్‌ ఇస్తామని రాహుల్‌ ప్రకటించారు.ఖమ్మంలో జన గర్జన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ బీజేపీ, బీఆర్‌ఎస్‌లపై విమర్శల వర్షం కురిపించారు. దేశాన్ని కలపడం మన విధానం.. విడదీయడం బీజేపీ విధానం.. కాంగ్రెస్‌ సిద్ధాంతాలకు ప్రజలు అండగా నిలిచారన్నారు. ప్రజల మనస్సుల్లో కాంగ్రెస్‌ పార్టీ ఉంది'' అని రాహుల్‌ పేర్కొన్నారు.అనేక వర్గాల ప్రజలకు తెలంగాణ స్వప్నంగా ఉండేది. 9 ఏళ్ల పాలనలో​ ప్రజల ఆకాంక్షలను బీఆర్‌ఎస్‌ పట్టించుకోలేదు. బీఆర్‌ఎస్‌ అంటే బీజేపీకి బంధువు పార్టీ తెలంగాణ తాను రాజుగా కేసీఆర్‌ భావిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో లక్ష కోట్ల అవినీతి జరిగింది. ధరణితో ముఖ్యమంత్రి భూములు దోచుకుంటున్నారు. మిషన్‌ భగీరథలో వేల కోట్లు దోచుకున్నారు

అని రాహుల్‌ దుయ్యబట్టారు.కర్ణాటకలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించాం. కాంగ్రెస్‌ పార్టీకి అన్ని వర్గాల ప్రజలు అండగా నిలిచారు. కర్ణాటకలో జరిగిందే తెలంగాణలో కూడా జరుగుతుంది. తెలంగాణలో బీజేపీ అడ్రస్‌ లేకుండా పోయింది. బీజేపీకి తెలంగాణలో బీఆర్‌ఎస్‌ బి టీమ్‌. బీజేపీ బి టీమ్‌తో మా పోరాటం కొనసాగుతోంది. కేసీఆర్‌ అవినీతికి మోదీ ఆశీస్సులు ఉన్నాయి'' అంటూ రాహుల్‌ గాంధీ మండిపడ్డారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :